నిజామాబాద్నాగారం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో డైట్ టెండర్ అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఏళ్ల తరబడిగా గుట్టుచప్పుడు కాకుండా టెండర్ ప్రక్రియ కొనసాగగా.. సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో 2024 జూలై 11న డైట్ సప్లయ్ టెండర్ విడుదల చేసి అదే నెల 16వరకు దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వివిధ కారణాలతో మూడుసార్లు టెండర్లు వాయిదా పడుతూ వస్తోంది. కాగా, టెండర్లో అర్హత ఉన్న ఐదుగురు సభ్యులతో మంగళవారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ చాంబర్లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కాగా, అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న వారికే డైట్ సప్లై టెండర్ అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏళ్ల తరబడి అనుభవం, బిల్లులు సకాలంలో మంజూరు కాకపోయినా డైట్ సప్లై చేస్తారని చెబుతున్నారు. కానీ, మిగతా టెండర్దారులు మాత్రం లక్కీ డ్రా తీయాలంటూ పట్టుబడుతున్నారు. ‘టెండర్ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమవుతుంది. ఏది ఏమైనా అధికారులు బుధవారం టెండర్ ఫైనల్ చేసి తీరుతాం’ అని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ తెలిపారు.
● పాతవారికే అప్పగించేందుకు
అధికారుల మొగ్గు
● లక్కీ డ్రా కోసం పట్టుబడుతున్న
టెండర్దారులు