నిరంతర సేవలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర సేవలు

Mar 19 2025 1:38 AM | Updated on Mar 19 2025 1:35 AM

పసుపు రైతుకు
రైతుల సలహాలను స్వీకరిస్తాం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పసుపు రైతులు తాము పండించిన పంటకు అదనపు విలువ జోడించి, ‘విలువ ఆధారిత ఉత్పత్తి’ని తీసుకురావాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి సూ చించారు. ఇందుకోసం రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో)లను మరింతగా ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో పసుపు రైతులు, ట్రేడర్ల అనుసంధాన సమావేశం నిర్వహించారు. చైర్మన్‌ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ రైతులు ఎఫ్‌పీవోలుగా ఏర్పడాలన్నారు. దీంతో ఎగుమతిదారులతో నేరుగా వ్యాపారం చేసేలా ఎదగొచ్చన్నారు. ప్రపంచంలో అత్యధికంగా 80 శాతం పసుపు భారత్‌లోనే రైతులు పండిస్తుండగా, ఇందులో 90 శాతం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రైతులే పండిస్తున్నారన్నారు. 2023–24 సీజన్‌లో భారత్‌ నుంచి 226.58 మిలియన్‌ డాలర్ల విలువైన 1,62,018 టన్నుల పసుపును ఎగుమతి చేశామన్నారు. 2023–24 సీజన్‌లో దేశంలో 3.05 లక్షల హెక్టార్లలో రైతులు పసుపు సాగు చేశారన్నారు. 10.74 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందన్నారు. పసుపునకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో సుగంధ ద్రవ్యాల బో ర్డు నుంచి విడదీసి ప్రత్యేకంగా నిజామాబాద్‌లో కేంద్ర ప్రభు త్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందన్నా రు. పసుపు బోర్డు ద్వారా రైతులకు, ట్రేడర్లు, అంతర్జాతీయ ఎగుమతిదారులతో నిరంతరం అనుసంధానం చేస్తామన్నారు. పసుపు బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 23న నాగ్‌పూర్‌, 24న చైన్నె, 26న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లలో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నిజామాబాద్‌, చుట్టుపక్కల జిల్లాల్లో పండిస్తున్న పసుపునకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉందన్నారు. దీంతో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పట్టుబట్టి మరీ ఇందూరుకు పసుపు బోర్డు తీసుకొచ్చారన్నా రు. ఈ బోర్డు కార్యకలాపాలను విడతలవారీగా విస్తరించుకుంటూ వస్తామన్నారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి పసుపు మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో రైతులకు, ఎగుమతిదారులకు నేరుగా లింక్‌ ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ సదస్పు ఏర్పాటు చేశా మన్నారు. రైతులకు ఇకమీదట నిరంతరం పసుపు బోర్డు ద్వారా అన్నిరకాలుగా పూర్తి సహకారం, ప్రోత్సాహం ఉంటుందన్నారు. జిల్లాలో పసుపు బోర్డు కార్యకలాపాలు విస్తరించిన తరువాత పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నా మని పేర్కొన్నారు. ఎఫ్‌పీవోలతో పాటు ఒక్కొక్క రై తును సైతం ప్రో త్సహిస్తామన్నా రు. రైతులను నేరు గా ట్రేడర్లు, ఎగుమతిదారులతో లింక్‌ చే సేందుకు నిరంతరం సమన్వయ సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త వంగడాల కోసం రీసెర్చ్‌, ఉద్యాన శాఖ, ఎంఎస్‌ఎంఈ, ట్రేడర్లు, ఎగుమతిదారులతో రైతులను అనుసంధానం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. మధ్యవర్తులు, ఏజెంట్లు లేకుండా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో స్పైసెస్‌ బోర్డు, టర్మరిక్‌ బోర్డు రీసెర్చ్‌ డైరెక్టర్‌ రేమాశ్రీ, జిల్లా అదనపు కలెక్టర్‌ అంకిత్‌, రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, శాస్త్రవేత్తలు, నాబార్డ్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం బాధ్యులు, రైతులు, 80 మంది ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.

మధ్యవర్తిత్వం లేని అమ్మకాలకు కృషి

కర్షకులు రైతు ఉత్పత్తిదారుల

సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి

విలువ ఆధారిత ఉత్పత్తులతో

మరింత మేలు

ట్రేడర్లు, అంతర్జాతీయ ఎగుమతిదారులతో రైతులకు అనుసంధానం

జిల్లాలో పసుపు ఆధారిత

పరిశ్రమల ఏర్పాటుకు కృషి

రైతులు, ట్రేడర్ల సమావేశంలో

పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి

రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి అన్నిరకాల సేవలందిస్తామని పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ అన్నారు. రైతుల నుంచి వచ్చిన సలహాలను సైతం స్వీకరిస్తామన్నారు. ఏళ్లతరబడి పంటలు పండిస్తున్న రైతులు ఇచ్చే సలహాలు అందరికీ ఉపయోగపడేలా అమలు చేస్తామని ఆమె తెలిపారు.

సదస్సులో ట్రేడర్లు, ఎగుమతిదారులు రైతులతో నేరుగా ఇంటరాక్ట్‌ అయ్యారు. రైతులు తీసుకొచ్చిన వివిధ రకాల పసుపు శాంపిళ్లను పరిశీలించారు. క్వాలిటీ పరీక్షలు చేశారు. పలువురు రైతులతో ఎగుమతిదారులు ఒప్పందాలు చేసుకున్నారు.

నిరంతర సేవలు 1
1/2

నిరంతర సేవలు

నిరంతర సేవలు 2
2/2

నిరంతర సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement