పేకాట స్థావరంపై దాడి | - | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడి

Mar 19 2025 1:34 AM | Updated on Mar 19 2025 1:33 AM

ఎడపల్లి: మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్‌ వద్ద నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ ఫోర్స్‌ సీఐ అంజయ్య, స్పెషల్‌ పార్టీ సిబ్బంది మంగళవారం దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకోగా వారి నుంచి రూ. 15,780 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

రెండు బోరు మోటార్ల చోరీ

మాచారెడ్డి: పాల్వంచ మండల శివారులోని ఇద్దరు రైతుల బోరు మోటార్లను గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి దొంగిలించినట్టు ఎస్సై అనిల్‌ తెలిపారు. గ్రామానికి చెందిన గాలి బొందయ్య, కొండె శ్రీనివాస్‌లకు చెందిన వ్యవసాయ భూమిలోని బోరు మోటార్లతో పాటు వైర్లను ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

రేపు సీజ్‌ చేసిన ఇసుక వేలం

నందిపేట్‌: మండలంలోని తల్వేద శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలకు గురువారం వేలం నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్‌ వసంతరావు పేర్కొన్నారు. గ్రామ శివారులో వాగు నుంచి అక్రమంగా తరలించిన 120 ట్రాక్టర్ల ఇసుకను కొందరు నిల్వ ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసినట్లు తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.20 వేలు దరావత్తు చెల్లించాల్సి ఉంటుందని డీటీ పేర్కొన్నారు.

ఆర్మూర్‌ డిగ్రీ కళాశాలలో కార్యశాల

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔషధ రూపకల్పనపై ప్రత్యేక కార్యశాల(వర్క్‌షాప్‌) నిర్వహించారు. ఈ సందర్భంగా తెయూ రసాయనశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్‌ బాల్‌కిషన్‌ హాజరై విద్యార్థులకు ఔషధాల ఆవిష్కరణ అవసరం, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఔషధాన్ని రూపొందించడంలో అనుసరించాల్సిన పద్ధతులు, పరిశోధనలో ఎదురయ్యే సవాళ్లు వాటిని అధిగమించే వినూత్న సాంకేతికతల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వేణుప్రసాద్‌, సునీల్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement