తెయూ(డిచ్పల్లి): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయస్థాయి ఉత్తమ పరిశోధనలు చేసి తెలంగాణ యూనివర్సిటీకి మంచి గుర్తింపు తీసుకురావాలని వీసీ యాదగిరిరావు సూచించారు. తెయూ ఫార్మాస్యూటికల్ విభాగానికి చెందిన విద్యార్థులు వెన్నెల, కృష్ణప్రకాష్లు ఇటీవల తైవాన్లోని నేషనల్ డాంగువా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశం పొందారు. ఈసందర్భంగా సోమవారం వీసీ, రిజిస్ట్రార్ వారిని అభినందించారు. అలాగే విద్యార్థులు అడ్మిషన్లు సాధించేందుకు కృషి చేసిన వాసం చంద్రశేఖర్, సత్యనారాయణరెడ్డి, శిరీషను వీసీ, రిజిస్ట్రార్ అభినందించారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఇందల్వాయి: ఇందల్వాయి ఉన్నత పాఠశాలలో సోమవారం 2006–07 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 18ఏళ్ల తర్వాత వారంత కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. లోకాని గోపి, మారంపల్లి శ్రీకాంత్, అశోక్, సువర్ణ, స్వప్న, లావణ్య తదితరులు ఉన్నారు.
ఉత్తమ పరిశోధనలతో వర్సిటీకి గుర్తింపు తేవాలి