ఇంటి నిర్మాణంపై తెగని పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

ఇంటి నిర్మాణంపై తెగని పంచాయితీ

Mar 18 2025 8:58 AM | Updated on Mar 18 2025 8:54 AM

ఖలీల్‌వాడి: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఓ ఇంటి నిర్మాణం విషయమై స్థల యజమాని, వీడీసీల మధ్య పంచాయితీ ఏడాదిగా కొనసాగుతోంది. ని బంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారంటూ వీడీసీ సభ్యులు పనులను అడ్డుకోగా, బాధితురాలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. జక్రాన్‌పల్లికి చెందిన సుంకరి స్రవంతి తన భర్తకు వంశపరపర్యంగా వచ్చిన ఇల్లు శిథిలావస్థకు చేరడంతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాలని కూల్చివేశారు. నూతన ఇంటి నిర్మాణం కోసం జులై11, 2024 జీపీ నుంచి ఆమె అనుమతి తీసుకున్నారు. కానీ నిబంధ నల మేరకు నిర్మాణం జరగడం లేదని, స్లాబు ముందుకు వచ్చిందని వీడీసీ సభ్యులు పనులను అడ్డుకున్నారు. వీడీసీ రూ.30వేలు జరిమానా విధించగా, కట్టేసి పనులు ప్రారంభించారు. అయినా మళ్లీ వీడీ సీ ఇబ్బందులకు గురిచేయడంతో బాధిత కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. గతనెల లో వీడీసీపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నెల రోజులు గడుస్తున్నా వీడీసీ సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. బెదిరిపులకు పాల్పడు తూ, కుటుంబంను గ్రామబహిష్కరణ చేస్తామని భ యబ్రాంతులకు గురి చేస్తున్న వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు స్రవంతి ఈనె ల 12న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. అ లాగే సెట్‌ బ్యాక్‌ లేకుండా, ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆ క్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టారని వీడీసీ స భ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జక్రాన్‌పల్లి జీపీ సెక్రెటరీ స్రవంతి భర్త లింగన్నకు నోటీసులు జారీ చేశారు. ఇంటిని కొలిచి ఇచ్చిన ప్లాన్‌కు విరు ద్ధంగా నిర్మించినట్లు నోటీసులో జీపీ సెక్రటరీ పే ర్కొన్నారు. దీనిపై బాధితురాలు హైకోర్టును ఆశ్ర యించగా స్టే విధించింది. స్పష్టమైన అధారాలతో ఈనెల 28న హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, నిజామాబాద్‌ కలెక్టర్‌, జక్రాన్‌పల్లి సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది. దీంతో సద రు జీపీ సెక్రెటరీ నుంచి రాష్ట్ర పంచాయతీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

పనులను అడ్డుకున్న జక్రాన్‌పల్లి వీడీసీ

హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలు

ఇంటి స్థలంలోనే నిర్మించాం..

ఇంటి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి వీడీసీ సభ్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంటి స్థలంలోనే ఇంటిని నిర్మించాం. రోడ్డును ఆక్రమించుకోలేదు. కావాలనే వీడీసీ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని చూస్తున్నారు. వీరి వేధింపులతో ఆత్మహత్యకు ప్రయత్నం చేశా. అధికారులు స్పందించి న్యాయం చేయాలి

–సుంకరి స్రవంతి, జక్రాన్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement