నిజామాబాద్ అర్బన్: పర్యాటక అభివృద్ధిలో అన్ని జిల్లాలకు స ముచిత ప్రాధాన్యత కల్పిస్తామ ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో పర్యాటక అభివృద్ధిపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అడిగిన ప్రశ్న కు మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు. ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతంలో పర్యావరణ ప ర్యాటక అభివృద్ధిలో భాగంగా ఉమ్మెడ గ్రామ సమీపంలో 1.20 ఎకరాలు, జలాల్పూర్ గ్రామ పరిధిలో 3 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించినట్లు వెల్లడించారు. శ్రీరాంసాగర్ బ్యాక్వాటర్ ప్రాంత పర్యాటకాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు
పర్యాటక అభివృద్ధిలో సముచిత స్థానం