సుభాష్నగర్: ఇతిహాస సంకలన సమితి తెలంగాణ ఆధ్వర్యంలో ‘దక్షిణ పథ’ పేరుతోహైదరాబాద్లోని ఐసీఎంలో శనివారం నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్కు ఇందూరు చరిత్ర పరిశోధకులు కందకుర్తి ఆనంద్, దావుల వివేకానంద హాజరయ్యారు. దక్షిణ భారతదేశ చరిత్ర పరిశోధకులు సెమినార్ ఏర్పాటు చేయగా, ఇందూరు ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల గురించి కందకుర్తి ఆనంద్, ఇందూరు జిల్లా దేవాలయాల చరిత్రను దావుల వివేకానంద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమర్పించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కాగా, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, అరవింద్రావు, చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు.