నిజామాబాద్నాగారం: సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ భారత జట్టుకు జిల్లాకు చెందిన క్రీడాకారిణులు ఎంపికయ్యారు. ఈనెల 25 నుంచి తైవాన్ దేశంలో జరుగనున్న ఏషియన్ సబ్ జూనియర్ మహిళల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో భార త జట్టు తరఫున వారు పాల్గొననున్నారు. అంతకుముందు ఈనెల 15నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరిగే మూడవ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎంపికై న వారిలో జిల్లా క్రీడాకారులు బి నిశిత, జి వర్షిని, డి కీర్తన (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి), ఆర్ సౌజన్య (సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ఆర్మూర్)ఉన్నారు. ఈసందర్భంగా క్రీడాకారులను జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగామోహన్, సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వినోద్ అభినందించారు.