నిజామాబాద్అర్బన్: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘తెలుగు సాహిత్యం ప్రదర్శన కళలు’ అనే అంశంపై కార్యశాల నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నంతో కలిసి శనివారం ఆవిష్కరించారు. తృతీయ సంవత్సరం విద్యార్థుల సిలబస్కు అనుబంధంగా ఈ కార్యశాలను రూపొందించడం జరిగిందని ప్రముఖ వ్యాఖ్యాత వీపీ చందన్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామస్వామి, రాజేశ్, భారత్ రాజ్, వినయ్ కుమార్, బాలమణి, రాజేశ్వర్, రాధిక, గంగాధర్, అర్చన, సవిత, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.