26న ‘తెలుగు సాహిత్యం–ప్రదర్శన కళలు’పై వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

26న ‘తెలుగు సాహిత్యం–ప్రదర్శన కళలు’పై వర్క్‌షాప్‌

Mar 16 2025 1:18 AM | Updated on Mar 16 2025 1:17 AM

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘తెలుగు సాహిత్యం ప్రదర్శన కళలు’ అనే అంశంపై కార్యశాల నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైస్‌ ప్రిన్సిపాల్‌ రంగరత్నంతో కలిసి శనివారం ఆవిష్కరించారు. తృతీయ సంవత్సరం విద్యార్థుల సిలబస్‌కు అనుబంధంగా ఈ కార్యశాలను రూపొందించడం జరిగిందని ప్రముఖ వ్యాఖ్యాత వీపీ చందన్‌ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామస్వామి, రాజేశ్‌, భారత్‌ రాజ్‌, వినయ్‌ కుమార్‌, బాలమణి, రాజేశ్వర్‌, రాధిక, గంగాధర్‌, అర్చన, సవిత, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement