నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. హిందూ–ముస్లిములు తనకు రెండు కళ్లలాంటి వారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్హందాన్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు పాల్గొన్నారు.
రంజాన్ కిట్లు పంపిణీ
జిల్లా కేంద్రంలో పేద ముస్లిములకు రంజాన్ కిట్లు, నిత్యావసర సామగ్రిని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ అందజేశారు. షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది పేద ముస్లిములకు రంజాన్ కిట్లను అందించడం సంతోషంగా ఉందన్నారు.
ఈద్గాల పరిశీలన
జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. నగరంలోని జదీద్ ఈద్గా, మదీనా ఈద్గా, ఐలేహదీస్ ఈద్గాలను మైనార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇతర నేతలతో కలిసి పర్యటించారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల నిర్వహణకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈద్గాల వద్ద పిచ్చిమొక్కల తొలగింపు, గుంతలు పూడ్చడం, తాగునీటి వసతి, విద్యుద్దీపాల ఏర్పాటు లాంటి వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
మైనారిటీల అభివృద్ధికి కృషి