డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని తొండాకూర్ గ్రామంలో ఓ బాలుడు పాముకాటుతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో ఒడ్డె సునీత తన కొడుకు శ్యామ్(10)తో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. బాలుడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సునీత కూలీపని చేసుకుంటూ బాలుడిని చూసుకుంటుంది. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం బాలుడు, తల్లి ఇంట్లో నిద్రించగా, నాగుపాము వచ్చి బాలుడి చెవి దగ్గర కాటు వేసింది. తల్లి గమనించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పామును కర్రతో చంపేశారు. వెంటనే బాలుడిని నందిపేట్లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, నిజామాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. జిల్లా కేంద్రంలో రెండు మూడు ఆస్పత్రులు తిరిగినా వైద్యం చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. ఆలస్యం కావడంతో బాలుడు మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లి రోదనలు మిన్నంటాయి.