నగరంలో పూల వ్యాపారులు సిండికేట్గా వ్యవహరిస్తున్నారు. పండుగలు, పూజల సమయంలో మహారాష్ట్ర నుంచి పూలు తెస్తారు. హోల్సేల్గా విక్రయించే వర్తకులు కిలోకు 100 గ్రాములు గండికొడుతున్నారు. 50 కిలోలకు 2 కిలోలు తక్కువగా తూకం వేస్తున్నారు. కూరగాయల వ్యాపారులు సైతం ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారు. కొందరు తక్కువ బరువు తూచే సాధారణరాళ్లను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ తూకం యంత్రాల్లోనూ కిలోకు 100 గ్రాముల మేర తక్కువ వచ్చేలా సెట్ చేసుకుంటున్నారు. మాంసం వి క్రయాల్లో మాయ చేస్తున్నారు. మాంసం కోసిన తర్వాత నీళ్లలో నానబెడుతున్నారు.