
విద్యారంగానికి నిధులను కేటాయించాలి
నిజామాబాద్అర్బన్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు గురువారం కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రశాంత్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శశిధర్, బాలకృష్ణ, దుర్గాదాస్ ఇంద్రసేన, యోగేశ్ రంజిత్, మణికంఠ, రఘు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు జెడ్పీ కార్యాలయ సమీపంలో ఉన్న మదర్ థెరిస్సా విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. నా యకులు విఘ్నేశ్, దీపిక, దినేశ్, రాజు, ఆజాద్, పృథ్వి, పరమేశ్, శ్రీ చరణ్, రమేశ్, అజయ్ ఉన్నారు.