
పసుపు బోర్డును తెచ్చిన ఘనత ఎంపీ అర్వింద్దే
నిజామాబాద్ సిటీ: ఎన్నికల సమయంలో పసుపు రైతుల సమస్యలు స్వయంగా చూసి చలించిన ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు కోసం ఎంతో శ్రమించి జాతీయ పసుపు బోర్డును జిల్లాలో ఏర్పాటు చేయించారని బీజేపీ మాజీ కార్పొరేటర్లు అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ కార్పొరేటర్లు పంచరెడ్డి ప్రవళిక, ఇప్పకాయల సుమిత్ర మాట్లాడుతూ.. పసుపు ధర తగ్గడంతో దానికి బాధ్యుడు ఎంపీ అర్వింద్ అన్నట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఎంపీ త్వరలో జాతీయ పసుపు బోర్డుకు కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారన్నారు.