ఖలీల్వాడి: నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయుర్వేద వైద్యుడు హన్మాండ్లు(52) మృతి చెందినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నందిపేట్ మండలం తల్వేదకు చెందిన ఆయుర్వేద వైద్యుడు హన్మాండ్లు నగరంలోని గోల్హనుమాన్వద్ద వాసవి ఆయుర్వేద ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వినాయక్నగర్కు బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా పులాంగ్ చౌరస్తా వద్ద సిగ్నల్ ప్రాంతంలో టిప్పర్ ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హన్మాండ్లును స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అదే బైక్పై ఉన్న మరో వ్యక్తి శ్రీహరికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ మహిళ ..
మాక్లూర్: కుటుంబ కలహాలతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన దుంపల సాయమ్మ(45) ఈనెల 6న భర్తతో గొడవపడి క్షణికావేశంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు వెంటనే మంటలను ఆర్పివేసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.