గ్రూప్‌–2లో మెరిసిన మగ్గిడి వాసి | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2లో మెరిసిన మగ్గిడి వాసి

Mar 13 2025 11:35 AM | Updated on Mar 13 2025 11:30 AM

పెర్కిట్‌: ఆర్మూర్‌ మండ లం మగ్గిడి గ్రామానికి చెందిన దాస గంగాధర్‌ మంగళవారం విడుదల చేసిన టీజీపీఎస్సీ ఫలితా ల్లో రాష్ట్ర స్థాయిలో 102 ర్యాంకు, బాసర జోన్‌ పరిధిలో 8వ ర్యాంకు, బాసర ఎస్సీ కమ్యూనిటీలో మొదటి ర్యాంకు సాధించాడు. మగ్గిడి గ్రామానికి చెందిన దాస చిన్న గంగారాం, దాస రాజు దంపతుల కుమారుడు గంగాధర్‌ పదో తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివాడు. భిక్కనూరు గురుకుల పాఠశాలలో 2013లో ఇంటర్‌, ఆర్మూర్‌ పట్టణంలోని నరేంద్ర డిగ్రీ, పీజీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీఎస్‌, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ పూర్తి చేశాడు. 2024లో గ్రూప్‌–4 ద్వారా నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌ ట్రెజరి ఆఫీస్‌లో జూనియర్‌ అకౌంటెంట్‌గా కొలువు సాధించాడు. అలాగే గ్రూప్‌–2 ఫలితాల్లో సైతం ఉత్తమ ర్యాంకు సాధించాడు. తమ కుమారుడు ఉత్తమ ర్యాంకు సాధించడంపై తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి నీటిచుక్కను

సద్వినియోగం చేసుకోవాలి

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కాలువల ద్వారా విడుదలవుతున్న ప్రతి నీటి చుక్క నూ ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్ట్‌ ఈఈ చక్రపాణి, ఏఈఈ రవి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటినిల్వ బోటాబోటిగా ఉన్న నేపథ్యంలో నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని, ఏప్రిల్‌ 9వరకు నీటి విడుదల ఉంటుందని అన్నారు. ఆలోగా పంటలు గట్టెక్కేలా రైతులు ప్రణాళిక రూపొందించుకోవాలని, ఆయకట్టు రైతులు ప్రాజెక్ట్‌ అధికారులకు సహకరించాలని వారు కోరారు.

కొనసాగుతున్న

ఇంటర్‌ పరీక్షలు

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్‌ సెకండియర్‌ బొటనీ, పొలిటికల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌–2ఏ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి రవికుమార్‌ తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మందికి 16,587 మంది పరీక్షలు రాయగా 477 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బోధన్‌లోని విజేత జూని యర్‌ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు చీటీలు రాస్తుండగా చీఫ్‌ సూపరింటెండెంట్‌ పట్టుకుని మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేశారన్నారు. జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 51 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉచిత శిక్షణకు

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌అర్బన్‌: బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ రంగంలో ఉచిత శిక్షణకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ కోఆర్డినేటర్‌ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఒక నెల నాన్‌ రెసిడెన్షియల్‌ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రయివేట్‌ బ్యాంకుల్లో ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తయి, 26ఏళ్ల లోపు వయసున్నవారు అర్హులన్నారు. ఆసక్తిగల బీసీ అభ్యర్థులు ఈనెల 15నుంచి వచ్చే నెల 8లోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకో వాలన్నారు. వచ్చే నెల 12న అభ్యర్థులకు ఎంపిక పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కు 08462–241055ను సంప్రదించాలన్నారు.

‘నిజాంసాగర్‌

కెనాల్‌ వైపు వెళ్లొద్దు’

నిజాంసాగర్‌: యాసంగి పంటల అవసరాల నిమిత్తం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నందున ఎవరూ కెనాల్‌వైపు వెళ్లవద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌ సూచించారు. గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్ర ధాన కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండనున్న నేపథ్యంలో కాలువలోకి వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement