తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి వ చ్చిన ప్రతిపాదనలపై వర్సిటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు అ ధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, పూర్వ విద్యార్థుల సంఘం, ఔట్సోర్సింగ్ అసోసియేషన్, కాంట్రాక్టు అ ధ్యాపకులతో పాటు రెగ్యులర్ అధ్యాపకులు సైతం వర్సిటీ పేరు మార్పు సరైన నిర్ణయం కాదని విమ ర్శిస్తున్నారు. బుధవారం ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. యూనివర్సిటీ పేరును మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతచారి మాట్లాడుతూ.. ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. యూనివర్సిటీ పేరు మారిస్తే సీఎం రేవంత్రెడ్డి చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ పేర్కొన్నారు.
తెయూ పేరు మార్చడమంటే తెలంగాణ ప్రజ ల అస్తిత్వాన్ని దెబ్బతీయటమేనని పీడీఎస్యూ జి ల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నా రు. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చే బదులు క్యాంపస్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్ను ఏర్పాటు చేసి ఈశ్వరీబాయి పేరు పెట్టుకోవాలని వర్సిటీ పూర్వ విద్యార్థులు యెండల ప్రదీప్, శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు వీసీకి, రిజిస్ట్రార్కు వినతిపత్రా లు అందజేశారు. తెలంగాణ పేరు సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్నదని ఈ పేరు మారిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశాలున్నాయని వీసీ టి యాదగిరి రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనను వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలికి లేఖ ద్వారా తెలియజేస్తామని వీసీ పేర్కొన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి
ప్రతిపాదనపై విద్యార్థుల ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
వీసీకి వినతిపత్రాలు అందజేసిన
విద్యార్థి సంఘాలు
వర్సిటీ పేరు మారిస్తే ఊరుకోం