ఆర్మూర్టౌన్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్(సీజీఆర్ఎఫ్) ఎరుకల నారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ ఏఈ కార్యాలయంలో బుధవారం విద్యుత్ వినియోదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది 24గంటల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉండాలన్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు రామకృష్ణ, లకావత్కిషన్, రాజగౌడ్, రాజేశ్వర్, రాజేశ్వర్రావు, కృష్ణ, లైన్మన్లు పాల్గొన్నారు.