డిచ్పల్లి: కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్చేంజ్ కార్యక్రమం జిల్లాలో బుధవారం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్కు చెందిన ఎంపిక చేయబడిన 30 మంది యువతీ యువకుల బృందం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చరిత్రాత్మక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, కర్మాగారాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, ఎస్బీఐ శిక్షణ సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు మహేశ్, ప్రభుత్వ అధికారులు, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.