
బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ రాక ఇబ్బందులు
నిజామాబాద్ రూరల్: బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ రాక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం మధ్యాహ్నం నుంచి సిగ్నల్ రాకపోవడంతో జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి పలువురు వినియోగదారులు వచ్చి అధికారులను నిలదీశారు. నాలుగు చోట్ల లైన్ డ్యామేజీ కావడంతో సిగ్నల్ రావడం లేదని బీఎస్ఎన్ఎల్ జిల్లా అడిషనల్ జనరల్ మేనేజర్ సీతారాం తెలిపారు. నిర్మల్ జిల్లా ఇచ్చోడ, డిచ్పల్లి–సదాశివనగర్, వర్ని– బాన్సువాడ మధ్య, బోధన్–నాందేడ్ మధ్య వివిధ పనులతో కేబుళ్లు కట్ అయినట్లు వివరించారు. లైన్లను పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాగా రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సిగ్నల్స్ వచ్చాయి.
నాలుగు ప్రాంతాల్లో లైన్ డ్యామేజ్
అయినట్లు అధికారుల వెల్లడి