
మోపాల్(నిజామాబాద్రూరల్): నగరశివారులోని బోర్గాం(పి)లోగల బంటు మున్నూరుకాపు సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బంటు గంగాదాస్, ఉపాధ్యక్షుడిగా బంటు సాయికుమార్, ప్రధానకార్యదర్శిగా బంటు రమేష్, కోశాధికారిగా చిట్టి మోహన్, బంటు శ్రీకాంత్, సభ్యులుగా మాచపత్రి చంద్రశేఖర్, చిట్టి పండరి, సలహాదారులుగా పుప్పాల శోభ, చిట్టి సాయిరెడ్డి, బంటు పెద్ద సాయన్న, చిట్టి నారాయణరెడ్డి, మాచపత్రి గంగారాం, బంటు సుభాష్ ఎన్నికయ్యారు. సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నియామకం
నిజామాబాద్ రూరల్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డిచ్పల్లిలోని తెలంగాణ యునివర్సిటీకి చెందిన అంబటి నాగరాజు నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర శాఖకు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.
నిరాశ్రయులకు రగ్గుల పంపిణీ
నిజామాబాద్నాగారం: నగరంలోని న్యాల్కల్ రోడ్డులోగల అర్బన్ ఉమెన్స్ షెల్టర్ పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో శనివారం రాత్రి నిరాశ్రయ మహిళలకు రగ్గులు, టిఫిన్బాక్సులను శ్రీలక్ష్మీ చేయూత సేవా సమితి సభ్యులు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షుడు వంగల రమణాచారి, సెక్రటరీ లక్ష్మన్, కోశాధికారి భూషన్చారి, కార్యవర్గ సభ్యులు శ్యామ్కుమార్, పూర్ణచందర్, కృష్ణ పాల్గొన్నారు.
దంతవైద్య శిబిరం
ఖలీల్వాడి: నగరంలోని ఆనంద నిలయం(అనాథ పిల్లల ఆశ్రమం)లో ఆదివారం జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా దంతవైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యులు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. అలాగే వారికి దంతాల సంరక్షణ జాగ్రత్తలు సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు స్వప్న, జిల్లా అధ్యక్షులు రాచర్ల భాస్కర్ రాజు, ఉపాధ్యక్షులు బిల్లా సాయిబాబా, రాపిల్లి గురు చరణ్, కన్వీనర్ నవీన్, సతీష్, వైద్యులు సమీర్ బనావత్, అనసూయ పాల్గొన్నారు.
ఘనంగా గోవిందమాంబ కల్యాణం
నిజామాబాద్ సిటీ: నగరంలోని ఆర్యనగర్లో ఆదివారం విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం (వేవా) ఆధ్వర్యంలో ఇంటింటా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబ కల్యాణం ఘనంగా నిర్వహించారు. వేవా జిల్లా అధ్యక్షుడు రాఘవపురం గోపాలకృష్ణచార్య, జిల్లా సలహాదారుడు వడ్ల హన్మాండ్లుచారి–సరోజన, సభ్యులు శ్రీధర్, రాంచందర్, శ్రీనివాస్, కాళిదాసు, విజయ్ కుమార్, వెంకటేశం, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ డీసీపీకి సన్మానం
మోపాల్(నిజామాబాద్రూరల్): నగరశివారులోని బోర్గాం(పి)లో ఆదివారం వరంగల్ డీసీపీ దాసరి మురళీధర్ను పద్మశాలీ సంఘం తర్ప–1 ఆధ్వర్యంలో సన్మానించారు. ఈసందర్భంగా సంఘ అధ్యక్షుడు వేముల కిషన్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన దాసరి మురళీధర్ ఐపీఎస్ హోదాలో విధులు నిర్వర్తించడం గర్వకారణమన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నతస్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రధాన కార్యదర్శి రచ్చ ఆనంద్, ఉపాధ్యక్షుడు గూడ నర్సింహులు, కోశాధికారి రచ్చ ఆంజనేయులు, సలహాదారులు రచ్చ శ్రీను, వేముల విశ్వనాథ్, జిందం దశరథం, సంఘం సభ్యులు పాల్గొన్నారు.




అంబటి నాగరాజు