
నగరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ధన్పాల్
ఖలీల్వాడి: ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా తెలిపారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో ఆదివారం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు ఈ పథకంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం లాగా కాకుండా నిరంతరం ప్రజలకు ఉపయోగపడే విధంగా అందించాలన్నారు. ఆర్టీసీ అధికారులు కూడా ప్రజలకు సహకరించాలన్నారు. ప్రజలు సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం మహిళలకు ఉచిత టికెట్ అందచేసి సిటీ బస్సులో ప్రయాణం చేశారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 60 శాతం నిధులు అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఇచ్చి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరు పెట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు ఇస్తే ప్రధాని ఫొటో పెట్టకపోవడం బాధాకరమన్నారు. భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ డీఎం సాయన్న, ఆర్టీసీ అధికారులు, డీఎంహెచ్వో సుదర్శన్, డిప్యూటీ సూపంరిడెంట్ బాలరాజ్, వైద్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్పాల్ సూర్యనారాయణగుప్తా
నగరంలో ‘మహాలక్ష్మి’,
ఆరోగ్యశ్రీ పథకాల ప్రారంభం
ఘనంగా వనభోజన కార్యక్రమం
నిజామాబాద్ సిటీ: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు ఆధ్వర్యంలో ఆదివారం వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. బోర్గాం(పీ) శ్రీ లక్ష్మీమహా గణపతి ఆలయంలో బ్రాహ్మణ సంఘ సభ్యులు లలితా పారాయణం, తులసీమాత, పూజ, గోపూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కార్యక్రమానికి విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ దేశ్ముఖ్, రొట్టె సురేష్, కోశాధికారి రమేష్ కులకర్ణి, లక్ష్మీ నారాయణ భరద్వాజ్, చంద్రశేఖర్, సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా

వనభోజనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు