
మాట్లాడుతున్న సీపీఎం నాయకులు
వర్ని: బడాపహాడ్లో భక్తుల నుంచి దోపిడీకి పాల్పడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని సీపీఎం పార్టీ వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడాపహాడ్లో జరుగుతున్న దోపిడీపై సీఎం దృష్టిసారించాలని కోరారు. అలాగే దర్గా వద్ద సౌకర్యాలు కల్పించాలని కోరారు. బస్టాండ్ నుండి దర్గా వరకు రోడ్డు వేసి, భక్తులకు సౌకర్యం కల్పించాలని కోరారు. లేదంటే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నాయకులు సాయిబాబు, లక్ష్మణ్ పాల్గొన్నారు.