అల్పాహారం ఆరంభ శూరత్వమేనా? | - | Sakshi
Sakshi News home page

అల్పాహారం ఆరంభ శూరత్వమేనా?

Dec 11 2023 12:24 AM | Updated on Dec 11 2023 12:24 AM

వేల్పూర్‌ ఉన్నత పాఠశాలలో మంత్రి హోదాలో అల్పాహారం అందజేస్తున్న ప్రశాంత్‌రెడ్డి (ఫైల్‌) - Sakshi

వేల్పూర్‌ ఉన్నత పాఠశాలలో మంత్రి హోదాలో అల్పాహారం అందజేస్తున్న ప్రశాంత్‌రెడ్డి (ఫైల్‌)

మోర్తాడ్‌(బాల్కొండ) : దసరా సెలవులకు ముందు గా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లాంఛనంగా కొన్ని పాఠశాలల్లో ప్రారంభించిన సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌ ప థకం ఆరంభ శూరత్వంగానే మిగిలిందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. సెలవుల తర్వాత అన్ని పా ఠశాలల్లో అల్పాహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తా మని గత ప్రభుత్వం వెల్లడించింది. అల్పాహారం ప థకానికి సంబంధించి సరైన మార్గదర్శకాలను జారీ చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్టోబర్‌ 6న గత ప్రభుత్వం నియోజకవర్గానికి ఒ క్కో స్కూల్‌లో ప్రారంభించి చేతులు దులుపుకుంద నే విమర్శలు వినిపిస్తున్నాయి. దసరా సెలవులు ముగిసిన తర్వాత అన్ని పాఠశాలలకు విస్తరించాల్సి ఉండగా నిధుల కేటాయింపు, సామగ్రి కొనుగోలు, మధ్యాహ్న భోజన మేజెన్సీలకు బిల్లులు, గౌరవ వే తనం చెల్లించకపోవడంతో అల్పాహారం కొన్ని పాఠశాలలకే పరిమితమైంది. జిల్లాలో 764 ప్రాథమిక, 145 ప్రాథమికోన్నత, 270 ఉన్నత పాఠశాలలు ఉండగా 1,17,147 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో కేవలం పదుల సంఖ్యలోని పాఠ శాలల్లోనే అల్పాహారం కార్యక్రమం కొనసాగుతుంది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున బిల్లు ను చెల్లిస్తున్నారు. ప్రస్తుతం సందిగ్థత నెలకొంది.

కొన్ని పాఠశాలల్లోనే పథకం ప్రారంభం

అక్టోబర్‌ 6న ప్రారంభించి తర్వాత

విస్తరించని వైనం

కొత్త ప్రభుత్వమైనా పథకంపై

దృష్టి పెట్టాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement