
రైస్ మిల్లులో దాచిన బియ్యం, డీసీఎం వద్ద టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, సిబ్బంది
ఎడపల్లి (బోధన్) : నిజామాబాద్ కమిషనరేట్ ప రిధిలోని ఎడపల్లి శివారులో ఓ రైస్మిల్పై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాడి చే శారు. ఈ రైస్ మిల్లులో భారీమొత్తంలో పీడీఎస్ బి య్యం పట్టుకున్నారు. ఈ దాడుల్లో ట్రాస్క్ఫోర్స్ ఏ సీపీ రాజశేఖర్ రాజు, సీఐ అంజయ్యతో పాటు సి బ్బంది ఉన్నారు. ఈ రైస్మిల్లో వ్యాన్లో 100 ట న్నుల వరకు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు 20 టన్నుల వరకు పాలిషింగ్ బియ్యం ఉన్నట్లు సమాచారం. సివిల్ సప్లై అధికారులకు వీటిని అప్పగించారు. పీడీఎస్ బియ్యంను పాలిషింగ్ చేసి మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు.
