
విజేతలకు సర్టిఫికెట్లు అందజేస్తున్న నిర్వాహకులు
నిజామాబాద్ నాగారం: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ గ్రౌండ్లో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. 5కె రన్, వాకింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్, జావలింగ్ త్రో 100 మీటర్ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. అనంతరం విజేతలకు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్రెడ్డి మెడ ల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీను నాయక్,అధ్యక్షుడు, బి గోపీరెడ్డి, కేవీ కిరణ్కుమార్, నీతా రెడ్డి, దశరథ్ రేఖారాణి, శ్రీనివాస్ సంగీతరావు, ఉమామహేశ్వర్రెడ్డి, శివ, ఇందిరా దినేశ్, గోపీ మహేశ్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.