లక్కంపల్లి సెజ్‌లో యూనిట్ల నిర్మాణం పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

లక్కంపల్లి సెజ్‌లో యూనిట్ల నిర్మాణం పూర్తి చేయాలి

Oct 3 2023 1:06 AM | Updated on Oct 3 2023 1:06 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలోని నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి)లో అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమల యూనిట్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో లక్కంపల్లి సెజ్‌కు 390 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌తో తాను మాట్లాడి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం రూ.50 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావడంతో సదరు యూనిట్‌ నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయిందన్నారు. ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణం పూర్తి చేయించాలని కోరారు.

ప్రధానికి మాజీ మంత్రి

సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement