లక్ష్మాపూర్‌లో స్పీకర్‌కు చేదు అనుభవం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మాపూర్‌లో స్పీకర్‌కు చేదు అనుభవం

Sep 30 2023 12:52 AM | Updated on Sep 30 2023 12:52 AM

- - Sakshi

వర్ని (చందూర్‌): మండలంలోని లక్ష్మాపూర్‌లో శుక్రవారం వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. వాటర్‌ ట్యాంక్‌ నిర్మించ తలపెట్టిన స్థలంలో బస్టాండ్‌ నిర్మించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ కాన్వాయిని అడ్డుకున్నారు. వాటర్‌ ట్యాంక్‌ను వేరే ప్రాంతంలో నిర్మించాలని పాతబస్టాండ్‌ ప్రాంతంలో కొత్త బస్టాండు లేదా వ్యాపార సముదాయాలను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement