
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జన్మదిన వేడుకలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సభ్యులు కేట్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నాయకులు శ్రీశైలం, మహేష్, అభినయ్, రాజకుమార్, రాము, సాయికుమార్, అనిల్, రమేష్, శంకర్, మల్లికార్జున్, గజేందర్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న నిరసన దీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం 21వ రోజు కొనసాగాయి. ఈసందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కంప్యూటర్, ప్రింటర్ వితరణ
సిరికొండ: మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు తాళ్లరామడుగు రామాలయం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి లాభిషెట్టి శ్రీనివాస్ గుప్తా కంప్యూటర్, జిరాక్స్ కమ్ ప్రింటర్ను వితరణ చేశారు. ట్రస్ట్ చైర్మన్ బచ్చు పురుషోత్తంగుప్తా, కోఆర్డినేటర్ బండారి నరేష్ తదితరులు ఉన్నారు.
ఆర్మీకి ఎంపికై న యువకుడికి సన్మానం
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన కలిగోట నితీష్ ఆర్మీకి ఎంపికయ్యాడు. ఈసందర్భంగా మంగళవారం ఆయనను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సన్మానించారు. సర్పంచ్ రమేష్, ఉపసర్పంచ్ సుమన్, సోసైటీ వైస్ చైర్మన్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్రెడ్డిని కలిసిన జిల్లా నాయకులు
ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు.
క్రీడాకారులకు అభినందన
నిజామాబాద్నాగారం: జిల్లా అథ్లెటిక్ పోటీలలో 8 పతకాలు సాధించిన ఆక్స్ఫార్డ్ పాఠశాల విద్యార్థులను మంగళవారం స్కూల్ యాజమాన్యం సత్కరించారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజగౌడ్, ఉపాధ్యక్షులు కపిల్, కరస్పాండెంట్ మోహన్, పీఈటీ రంజిత్ పాల్గొన్నారు.
భగవద్గీత పంపిణీ
నిజామాబాద్ సిటీ: నగరంలోని వినాయక్నగర్ పంచముఖి హనుమాన్ ఆలయం హైదవ సేనా గణేష్ మండలి వద్ద మంగళవారం భగవద్గీత పుస్తకం పంపిణీ చేశారుది. గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా జీజీ కళాశాల ప్రొఫెసర్ సేర్ల దయానంద్ భగవద్గీత పుస్తకాన్ని స్థానికుడు పోలో అర్జున్రెడ్డికి అందజేశారు.
బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి
నిజామాబాద్అర్బన్: టీచర్ల బదిలీలు, పదోన్నతులు తప్పులు లేకుండ పారదర్శకంగా నిర్వహించాలని డీటీఎఫ్ నాయకులు మంగళవారం డీఈవో దుర్గప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు రాజన్న, శంతన్ తదితరులు ఉన్నారు.
అఖిలేష్ యాదవ్ను కలిసిన గోర్త రాజేందర్
ఖలీల్వాడి: ఆర్మూర్ నియెజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గోర్త రాజేందర్ మంగళవారం లక్నోలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను మార్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో ఆర్మూర్లో నిర్వహించబోయే బీసీల మహా గర్జన సభకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆయనను రాజేందర్ కోరారు.
మహిళలకు రుణాలు పంపిణీ
ఇందల్వాయి: మండల కేంద్రంలో మంగళవారం డీఆర్డీవో చందర్ నాయక్ పర్యటించి లబ్ధిదారులకు మంజూరైన బ్యాంకు రుణాలతో పాటు పలు ఎంటర్ప్రైజెస్ యూనిట్లను అందజేశారు. ఐకేపీ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ సకాలంలో మహిళ సంఘాలకు రుణాలు అందేలా, వారు చెల్లించేలా చూడాలని అన్నారు. ఎంపీటీసీ దాసు, ఏపీఎమ్ సువర్ణ, వీవోఏలు పాల్గొన్నారు.


