వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వండి

Sep 27 2023 1:28 AM | Updated on Sep 27 2023 1:28 AM

- - Sakshi

డిచ్‌పల్లి: వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర చెల్లించాలని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆకుల పాపయ్య డిమాండ్‌ చేశారు. మండలంలోని నడిపల్లి రైతు వేదికలో మంగళవారం ఇందూరు–డిచ్‌పల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీవో) మహాజన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు చెరుకు సాగు, బెల్లం తయారీకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ప్రాంతంలో ఏయే పంటలు పండుతాయో వాటికి అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు అందించి ప్రభుత్వం వారిని ప్రోత్సహించాలని కోరారు. చైర్మన్లు నాగయ్య, శ్రీనివాస్‌, డైరెక్టర్లు భూమయ్య, పెంటయ్య, పద్మ, రాజన్న, వెంకట్‌రెడ్డి, థామస్‌ మోడీ, రాజలింగం, అఖిల తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గ్రూప్‌–1 రద్దు

తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణివల్ల హైకోర్టు గ్రూపు – 1 పరీక్షను రద్దు చేసిందని బీడీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయకార్యదర్శి దనవేందర్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్థన్‌రెడ్డిని తొలగించి, బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు.

పర్యావరణ రక్షణ

అందరి బాధ్యత

డిచ్‌పల్లి: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ నిజామాబాద్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ (ఎఫ్‌పీవో) ధర్మానాయక్‌ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్‌ బ్యూరో కమ్యూనికేషన్‌, నిజామాబాద్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఖిల్లా డిచ్‌పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మానాయక్‌ మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే పదార్థాల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాలలో పరిసరాలను శుభ్రం చేశారు. సాయిబాబు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు

పరిష్కరించాలి

సిరికొండ: అంగన్‌వాడీ, ఆశ, ఎండీఎం కార్మి కుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్‌ డిమాండ్‌ చేశారు. సమ్మె చేస్తున్న ఆయా కార్మికులకు ఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో మంగళవారం సంఘీభావం తెలిపారు. భోజన్న, సంతోష్‌, రాజన్న, లింగం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి

జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లిలో దళిత యువతిపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో బాధితురాలికి మద్దతుగా ఎమ్మార్పీఎస్‌, ప్రజాపంథా, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు దేవరాం, నాగం రాజేష్‌, కార్తీక్‌, అనిల్‌, గంగాధర్‌ దళిత నాయకులు పాల్గొన్నారు.

పౌష్టికాహార కిట్స్‌ పంపిణీ

నిజామాబాద్‌నాగారం: నగరంలోని టీబీ సెంటర్‌లో మంగళవారం క్షయ వ్యాధి గ్రస్థులకు పౌష్టికాహార కిట్స్‌ను డీఎంహెచ్‌వో సుదర్శన్‌ ఆధ్వర్యంలో సూర్య హెల్త్‌ ఆర్గనైజషన్‌ డైరెక్టర్‌ సూర్య భగవాన్‌ అందజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజషన్‌ సిబ్బంది రాజేంద్ర, జిల్లా టీబీ కోఆర్డినేటర్‌ రవిగౌడ్‌, లయన్స్‌ క్లబ్‌ సెక్రటరీ వివేకానంద, నరేష్‌, ధనుంజయ్‌, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement