కన్నవారిని చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించే వారిపై కఠిన చర్యలుండాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. అయితే కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. గతంలో ఒక జిల్లాస్థాయి అధికారి తన తల్లిని సరిగా చూసుకోవడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే పరిశీలించిన అధికారి ప్రతీనెల తల్లికి రూ.పదివేల చొప్పున ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినా నేటికీ అమలుకాలేదు. ఇలా తూతూమంత్రంగా కాకుండా పథకం పకడ్బందీగా అమలు చేయాలి. – ఎంసీ లింగన్న, ప్రభుత్వ
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు


