రోజురోజుకు పెరుగుతున్న ఎండలు మూగజీవాలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి కత్తెరసాల పశు వైద్యాధికారి సతీశ్
చెన్నూర్రూరల్: ఎండలు దంచి కొడుతున్నాయి. రానురాను ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు బాగా ముదిరే అవకాశాలు ఉన్నాయి. ఎండలకు పశువులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కత్తెరసాల పశు వైద్యాధికారి సతీశ్ పలు సూచనలు చేశారు.
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎండతో అనారోగ్యం
ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పశువులు మేత తినకుండా ఉంటాయి. పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. పశువులు పడు కోవడం తక్కువగా కనిపిస్తుంది. నోటి వెంట సొల్లు కారుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాయి. శబ్దం చేస్తూ శ్వాస తీసుకుంటాయి. కళ్లు ఎరుపు రంగులోకి మారి వేడిగా ఉంటాయి. ఈ లక్షణాలు ముదిరితే పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. వేసవిలో పశువుల్లో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని పశు వైద్యాధికారిని సంప్రదించాలి.


