జిల్లాలో రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొనాలి. మొక్కజొన్న పంట చేతికి అందిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాలేదు. మొక్కజొన్న ఎకరానికి 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ 20 క్వింటాళ్లలోపే కొనాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అలా అయితే మిగిలిన పంట ఎవరికి అమ్ముకోవాలి. నెల రోజులుగా శనగ పంట చేతికి వచ్చిన కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులకే విక్రయించారు. 70 శాతానికి పైగా అమ్ముకున్నాక ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మొక్కజొన్న, జొన్న, కందుల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరిచి మద్దతు ధరకు పంటలు కొనాలి. – గంగాధర్, రైతు టాక్లి


