హెల్మెట్‌తో ప్రాణాలు భద్రం | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌తో ప్రాణాలు భద్రం

Oct 28 2025 8:38 AM | Updated on Oct 28 2025 8:38 AM

హెల్మెట్‌తో ప్రాణాలు భద్రం

హెల్మెట్‌తో ప్రాణాలు భద్రం

● తప్పనిసరిగా వినియోగించాలని పోలీసుల సూచన ● భైంసా పట్టణంలోని రాహుల్‌ నగర్‌ కు చెందిన రోహిత్‌ సెప్టెంబర్‌ 15న అతని స్నేహితుడితో కలిసి బైక్‌పై నిర్మల్‌ వైపు వెళ్లే క్రమంలో నర్సాపూర్‌(జి) మండలంలోని రాంపూర్‌ 61వ జాతీయ రహదారిపై పక్కన నిలిపి ఉన్న ఎడ్లబండిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. ● సెప్టెంబర్‌ 28న రాత్రి ముధోల్‌ మండలం తరోడకు చెందిన దేవానంద్‌ భైంసా వైపు నుంచి తరోడకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ● ఈనెల 1న కడెం మండలం ధర్మాజీపేట్‌ గ్రామానికి చెందిన రొడ్డ చందు కడెం వైపు నుంచి ధర్మాజీపేట్‌ వెళ్తుండగా.. గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. కింద పడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ● భైంసా పట్టణానికి చెందిన హోమియోపతి డాక్టర్‌ కుమార్‌ యాదవ్‌ ఈనెల 3న బైక్‌పై నిర్మల్‌కు వెళ్లి వస్తుండగా హైవేపై ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ● సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామానికి చెందిన సాయన్న ఈ నెల 3న పని నిమిత్తం బైక్‌పై నిర్మల్‌ వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ● లోకేశ్వరం మండలం హవర్గా గ్రామానికి చెందిన సిందే అరవింద్‌ ఈనెల 6న బైక్‌పై నిర్మల్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డుగా ఉన్న గేదెను ఢీకొన్నాడు. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ● మహారాష్ట్రలోని ఉమ్రి గ్రామానికి చెందిన సాయినాథ్‌ ఈ నెల 6న తానూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి బైక్‌పై వస్తుండగా బెల్‌ తరోడా చెక్‌పోస్ట్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

నిర్మల్‌టౌన్‌: ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్‌ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు రక్షించుకోవచ్చని రవాణావాఖ అధికారులు, పోలీసులు చెబుతున్నప్పటికీ గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో హెల్మెట్‌ వాడకాన్ని విస్మరిస్తున్నారు. జిల్లాలో 85 శాతం మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించడం లేదని సమాచారం. రోడ్డు ప్రమాదంలో 60 నుంచి 70 శాతం వరకు హెల్మెట్‌ లేకనే మృతి చెందినట్లు అంచనా.

నామ మాత్రపు తనిఖీలు

పోలీసులు, రవాణా శాఖ హెల్మెట్‌ ధరించని వారిపై చర్యలు అంతగా తీసుకోవడం లేదని, తనిఖీలు కూడా నామమాత్రంగా చేపడుతున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా పోలీసులు, రవాణా అధికారులు తమ బాధ్యతగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

నాణ్యమైన వి ఉపయోగించాలి

నాసిరకం హెల్మెట్‌ ప్రమాద తీవ్రతను ఏమాత్రం తగ్గించలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. హెల్మెట్‌ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. హెల్మెట్‌ స్ట్రాప్‌ గడ్డంపై ఉంచేందుకు అనువుగా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. తలకు ధరించినప్పుడు స్ట్రాప్‌ తీసుకునేందుకు, పెట్టుకునేందుకు వీలుగా ఉండాలి. ప్రధానంగా డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్పోర్టేషన్‌ ఐఎస్‌ఐ అనుమతులు పొందిన కంపెనీల హెల్మెట్లు ధరించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. హెల్మెట్‌ వాడటం వల్ల ప్రాణాపాయం నుంచి 98 శాతం బయటపడొచ్చు. దుమ్ము, దూళి, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది.

వాడకంపై చట్టం..

ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ఖచ్చితంగా పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177 సెక్షన్లు చెబుతున్నాయి. దీని ప్రకారం ఎవరైనా హెల్మెట్‌ ధరించకపోతే జరిమానా విధించే అవకాశాలున్నాయి. పదేపదే వాహనదారుడు హెల్మెట్‌ లేకుండా జరిమానా కడుతుంటే డ్రైవింగ్‌ లెసెన్స్‌ శాశ్వతంగా రద్దుచేసే అవకాశం ఉంటుంది.

ఇటీవల జరిగిన ఘటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement