● జూలై 1న 14 గేట్లు ఎత్తనున్న త్రిసభ్య కమిటీ సభ్యులు ● ఎస్సారెస్పీలోకి గోదావరి ప్రవాహం | - | Sakshi
Sakshi News home page

● జూలై 1న 14 గేట్లు ఎత్తనున్న త్రిసభ్య కమిటీ సభ్యులు ● ఎస్సారెస్పీలోకి గోదావరి ప్రవాహం

Jun 30 2025 3:52 AM | Updated on Jun 30 2025 3:52 AM

● జూలై 1న 14 గేట్లు ఎత్తనున్న త్రిసభ్య కమిటీ సభ్యులు ●

● జూలై 1న 14 గేట్లు ఎత్తనున్న త్రిసభ్య కమిటీ సభ్యులు ●

భైంసా:మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ని ర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు జూలై 1 నుంచి తెరుచుకోనున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్‌ 28 వర కు 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీరు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి చే రనుంది, దీనివల్ల నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల రై తులకు తాగు,సాగునీటి అవసరాలు తీరనున్నాయి.

త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో

బాబ్లీ ప్రాజెక్టుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో పో రాటాలు, కోర్టు వివాదాలు జరిగాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, వర్షాకాలంలో గోదావరి నది ప్రవాహానికి అడ్డంకులు లేకుండా గేట్లు తెరిచి ఉంచాలని నిర్దేశించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల సమక్షంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు జూలై 1న గేట్లను ఎత్తనున్నారు.

ఎస్సారెస్పీలో ప్రస్తుతం..

ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1064.60 అడుగుల వద్ద 15.567 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్ల నుంచి విడుదలయ్యే వరద నీరు ఈ ప్రాజెక్టులోకి చేరనుంది. ఎస్కేప్‌ గేట్ల ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్పీ నుంచి విడుదల చేస్తున్నారు. బాబ్లీ నుంచి వచ్చే నీరు నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి, బాసర మీదుగా ఎస్సారెస్పీకి చేరుతుంది. తెలంగాణ సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబ్లీ నుంచి ఎస్సారెస్పీ వరకు సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉండగా, నీరు చేరడానికి కొంత సమయం పడుతుంది.

రైతులకు ఉపయోగం..

ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో, బాబ్లీ గేట్ల విడుదలతో గోదావరి నది నిండుగా ప్రవహించనుంది. దీనివల్ల నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని ఎత్తిపోతల పథకాల కింద లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు పుష్కలంగా నీరు అందనుంది. రైతులు ఇప్పటికే వరి నారుపోసి, మరో వారంలో నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో బాబ్లీ నీటి విడుదల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఏర్పాట్లు చేసిన నీటిపారుదల శాఖ..

బాబ్లీ గేట్ల విడుదల కోసం మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు జోరందుకునే ముందే గేట్లను తెరిచి, సహజ నీటి ప్రవాహాన్ని ఎస్సారెస్పీకి చేరేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియ వర్షాకాలంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

బాబ్లీ ప్రాజెక్టు(ఫైల్‌)

ప్రాజెక్టు పేరు : బాబ్లీ

నిర్మాణ స్థలం : గోదావరి నదిపై

మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ తాలుకా బాబ్లీ గ్రామం వద్ద గేట్లు : 14

నీటి నిల్వ సామర్థ్యం : 2.74 టీఎంసీ

గేట్లను పైకి ఎత్తే తేదీ : ప్రతియేట

జూలై 1 నుంచి

తిరిగి గేట్లను దించేతేదీ : ప్రతియేట

అక్టోబర్‌ 28

దూరం : తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు 7 కిలోమీటర్లు, బాసరకు 18 కిలోమీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement