
విద్యార్థిని నృత్య ప్రదర్శన
బోథ్: మండల కేంద్రానికి చెందిన నాంపల్లి సాయిసాగర్–అనిత దంపతుల కుమార్తె వైష్ణవి తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నిర్వహించే భక్తి నృత్య ప్రదర్శనలో పాల్గొంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఆమె నృత్యంపై మక్కువతో శిక్షణ తీసుకుంది. కాగా, టీటీడీ వద్ద నృత్యం చేయడానికి అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా వైష్ణవి చేసిన నృత్యం అందరినీ అలరించింది. తన కూతురికి అక్కడ నృత్యం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.