
బైక్ దగ్ధం
కుంటాల: మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపాన గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి బైక్కు నిప్పంటించారు. గ్రామానికి చెందిన అరిగెల గజ్జారాం వ్యవసాయ పనులు ముగించుకుని తన ఇంటి ముందు బైక్ వర్షానికి తడవకుండా టార్పాలిన్ కప్పి పార్క్ చేసి ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి గజ్జారాం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే టైర్లు పేలిన శబ్దం వచ్చి, బైక్ దగ్ధమైంది. ఘటన స్థలాన్ని ఎస్సై అశోక్ ఆదివారం పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.