
శెభాష్.. సింగరేణి
● వెలుగుల రికార్డులకు అవార్డులు ● జాతీయస్థాయిలో ఎస్టీపీపీకి గుర్తింపు ● పక్కాగా విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ ● ఎస్టీపీపీలో సీఎండీ బలరాం మార్క్ ● సింగరేణికి తలమానికంగా ప్లాంట్
జైపూర్: సింగరేణి సంస్థ ప్రత్యక్షంగా విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన అనతికాలంలో ఉత్పత్తి, నిర్వహణలో దేశస్థాయిలో రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక పీఎల్ఎఫ్(ప్లాంటు లోడ్ ఫ్యాక్టరీ)తోపాటు నిర్వహణలో జీరో వాటర్ యూటిలైజేషన్, యాష్ వినియోగం, కర్బన ఉద్గారాలు తగ్గిస్తూ పర్యావణహిత చర్యలు చేపడుతూ శెభాష్ సింగరేణి అనిపించుకుంటోంది. ఒకపక్కన థర్మల్ పవర్ ప్లాంటు, మరో పక్కన భూమిపై సోలార్, నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటు చేస్తూ జాతీయస్థాయిలో పురస్కారాలు అందుకుంటోంది.
ఇప్పటికే 54 అవార్డులు..
ఎన్టీపీపీ, జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ను తలదన్నేలా ఎస్టీపీపీ అత్యధిక పీఎల్ఎఫ్ సాధనలో దేశస్థాయిలో వరుసగా మొదటి వరుసలో నిలువడంతోపాటు అన్నివిభాగాల్లో అవార్డులు కై వసం చేసుకుంటోంది. ఎస్టీపీపీకి ఇప్పటికే 54 అవార్డులు వరించాయి. ఈ అవార్డులు అందుకోవడం పట్ల అధికారులు, ఉద్యోగులపై సంస్థ సీఎండీ ఎన్.బలరాం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీపీపీలో ఆయన మార్క్ చూపుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
పర్యావరణ హిత చర్యల్లో మేటి..
పర్యావరణహిత చర్యల్లో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సల్ఫర్ను ఎఫ్జీడీ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్(ఎఫ్జీడీ) పద్ధతిలో జిప్సంగా మార్చే పనులు పూర్తయ్యాయి. ఇందుకు రూ.700 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగే సమయంలో గాల్లోకి సల్ఫర్ ఆకై ్సడ్ శాతం ఘనపు మీటర్కు 2 వేల మిల్లీగ్రాములు ఉంటోంది. దీంతో వాతావరణంలో తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయి. 2,200 మిల్లీ గ్రాములకు తగ్గించడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎఫ్జీడీ నిర్మాణంతో బొగ్గు బూడిదను వందశాతం గాలిలో కలవకుండా నిలువరిస్తుంది. బొగ్గును మండిస్తే వెలువడే వేడి, నీటిని ఆవిరి రూపంలో మార్చే శక్తితో టర్బైన్లు తిప్పుతూ విద్యుత్ ఉత్పత్తిప్రక్రియ చేపడుతారు. అయితే చివరకు వెలువడే బూడిద, విషవాయువులను శుద్ధి చేస్తున్నారు. ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్తో బూడిదను గాలిలో కలువకుండా చేస్తున్నారు. ఇలా వేరు చేసిన యాష్ను సిమెంట్, ఇటుకల నిర్మాణ రంగపరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఇలా వందశాతం యాష్ వినియోగం చేస్తూ జాతీయస్థాయిలో బెస్ట్ఫ్లైయాష్ యుటిలైజేషన్, ఉత్తమ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, ఎనర్జీ ఎఫీషియంట్ ప్లాంటు, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్, పొల్యూషన్ కంట్రో అండ్ ఎక్విప్మెంట్, గోల్డెన్ అవార్డు ఇన్ ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్సీ, జీరో వాటర్ యుటిలైజేషన్లో ఇలా 54 అవార్డులు అందుకుంది.
అవార్డులు రావడం గర్వకారణం
సీఎండీ బలరాం దిశానిర్దేశఽంతో అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా పవర్ ప్లాంటు అన్నిరంగాల్లో ముందంజలో నిలుస్తోంది. కర్బన ఉద్గరాలు తగ్గించడానికి ఇప్పటికే ఎఫ్జీడీ నిర్మాణం పూర్తయింది. త్వరలో ప్రారంభిస్తాం. అన్నివిభాగాల్లో జాతీయస్థాయిలో అవార్డులు రావడం అందరికీ గర్వకారణం. ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ ఎస్టీపీపీని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుపుతాం.
– సీహెచ్ చిరంజీవి, ఎస్టీపీపీ ఈడీ

శెభాష్.. సింగరేణి

శెభాష్.. సింగరేణి