
మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత
● ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలు దానం
మందమర్రిరూరల్: మంచిర్యాల మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని కు టుంబ సభ్యులు అప్పగించారు. ఆమె నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. వివరాలు ఇలా..మండలంలోని మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల అమృతమ్మ(90) శనివారం రాత్రి మృతిచెందింది. తల్లి మృతి చెందినప్పటికి పది మందికి ఉపయోగపడాలని కుమారుడు శ్యాంసుందర్రెడ్డి ఆలోచన చేశాడు. తల్లి నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల(ఐ బ్యాంక్)కు అప్పగించారు. మృతదేహాన్ని మంచిర్యాల మెడికల్ కళాశాల వారికి సదాశయ ఫౌండేషన్ ద్వారా అప్పగించారు. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య ఆదివారం వైకుంఠరథంలో మృతదేహాన్ని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. మృతురాలికి భర్త రాజిరెడ్డి ఉన్నారు.

మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత