
వికాసం.. ఆలస్యం!
నిర్మల్
ఎట్టకేలకు వేతనాలు
ఉద్యోగ నియామకం కోసం పరీక్ష రాసి ఎంపికై న తర్వాత 15 ఏళ్లకు నియామక ఉత్తర్వులు చేతికందాయి. విధుల్లో చేరిన నాలుగు నెలల తర్వాత వేతనాలు మంజూరయ్యాయి.
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025
పుష్కర ఘాట్ల పరిశీలన
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల గోదావరి పుష్కరఘాట్ల వద్ద పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టర ఆదేశాల మేరకు భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ పవన్ చంద్ర, ఎస్సై శ్రీనివాస్, ఆర్అండ్బీ అధికారులు గోదావరి పుష్కర ఘాట్లను శుక్రవారం పరిశీలించారు. ఇటీవలే హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు గోదావరి నదిలో మునిగి మృతి చెందడంతో అప్రమత్తమయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఘాట్ వద్ద జాలీలు, వాచ్ టవర్ నిర్మాణం, మైక్ సిస్టమ్తో అనౌన్స్మెంట్, గజ ఈతగాళ్లు నిరంతరం నది వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
నిర్మల్చైన్గేట్: యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.5 లక్షలలోపు రుణాలు అందించేలా ఈ పథకం రూపొందించారు. ఈమేరకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే లబ్ధిదారుల ఎంపికలో జాప్యంతో ఇప్పటికీ రుణాలు మంజూరు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 7,214 యూనిట్లు మంజూరు చేయాలనే లక్ష్యం ఉండగా, 35,177 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొంతమందికి మంజూరు పత్రాలు అందజేస్తారని ప్రచారం జరి గినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల స్థాయిలోనే కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వం యూనిట్ల మంజూరు పత్రాల పంపిణీని నిలిపివేసింది.
అర్హుల ఎంపికకు ఆటంకాలు..
రుణ దరఖాస్తుల నుంచి మండల స్థాయిలో అర్హుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. ఈ జాబితాలను జిల్లా స్థాయికి పంపి, బడ్జెట్ అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలి. అయితే, మండలస్థాయి కమిటీలు తుది జాబితాలను సిద్ధం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎంపీడీవో, డీఆర్డీఏ సిబ్బంది, బ్యాంక్ అధికారులతో కూడిన ఈ కమిటీలపై రాజకీయ ఒత్తిళ్లు కారణంగా జాబితాలు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. దీంతో దరఖాస్తుదారులు మంజూరు పత్రాల కోసం ఎదురుచూస్తున్నారు.
స్థానిక ఎన్నికలతో మరింత జాప్యం
రాష్ట్రంలో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, రాజీవ్ యువ వికాసం పథకం అమలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొందరిని ఎంపిక చేసి, మరికొందరిని విస్మరిస్తే, మిగిలిన వారిలో అసంతృప్తి ఏర్పడి, ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికార పార్టీలో చర్చ నడుస్తోంది.
సబ్సిడీ వివరాలు
రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.50 వేల యూనిట్కు 100% సబ్సిడీ, రూ.లక్ష వరకు 90% సబ్సిడీ, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80% సబ్సిడీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70% సబ్సిడీ అందిస్తారు. మొదటి ప్రాధాన్యం రూ.50 వేలు, రూ.లక్ష యూనిట్లకే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆదేశాలు రావాల్సి ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఈ నెల 2న ప్రారంభించాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా వేసింది. రూ.50 వేల రుణానికి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశాం. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి
న్యూస్రీల్
జూన్ 2న చెక్కుల పంపిణీ అంటూ హడావుడి అర్హుల ఎంపిక కూడా పూర్తికాని వైనం.. యూనిట్ల మార్పునకూ రాని అనుమతులు నిరుద్యోగులకు తప్పని నిరీక్షణ
నిర్మల్కు చెందిన పరమేశ్వర్ ఆటో కొనుగోలు చేసి సొంత వ్యాపారం ప్రారంభించాలనే కలతో రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.4 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని సిబిల్ స్కోర్ బాగుండటంతో బ్యాంకర్లు దరఖాస్తును ప్రాధాన్య జాబితాలో ఉంచారు. అయినా ప్రభుత్వం పథకం అమలును వాయిదా వేయడం, అమలు షెడ్యూల్ను ప్రకటించకపోవడంతో రుణం దక్కక అతడు ఆందోళనలో ఉన్నాడు. పెట్టుబడి లేకపోవడంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించలేదు.
సిబిల్ స్కోర్కు ఉంటే..
దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలిస్తారు. మండల కమిటీ ఆమోదం తర్వాత జాబితా జిల్లా కమిటీకి చేరుతుంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గతంలో కార్పొరేషన్ల నుంచి లబ్ధి పొందినవారు, బ్యాంక్ రుణాలు చెల్లించక డిఫాల్టర్గా ఉన్నవారిని పరిగణనలోకి తీసుకోరు. సిబిల్ స్కోర్ను పట్టించుకోవద్దని ప్రభుత్వం సూచించినప్పటికీ, బ్యాంకర్లు దానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కేటగిరీ మార్పుపై ఒత్తిడి..
మొదటి విడతలో రూ.లక్షలోపు రుణాలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో, 3, 4 కేటగిరీలలో దరఖాస్తు చేసుకున్న చాలామంది తమను 1 లేదా 2 కేటగిరీలకు మార్చాలని అధికారులను కోరా రు. అయితే, కేటగిరీ మార్పుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలూ రాలేదని అధికారులు దరఖాస్తుదారులను తిరస్కరించారు.
కార్పొరేషన్ దరఖాస్తులు మంజూరైన రాయితీ నిధులు
యూనిట్లు (రూ.కోట్లలో)
ఎస్సీ 7,350 2,894 39.96
ఎస్టీ 3,627 2,325 25.35
బీసీ 17,286 3,876 41.00
ఏంబీసీ/ఈబీసీ 923 842 8.90
మైనార్టీ 5,926 1,045 17.41
క్రిస్టియన్ 65 27 0.42

వికాసం.. ఆలస్యం!