
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
నిర్మల్ చైన్గేట్: ప్రజాపాలనలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షలో మాట్లాడారు. అంతకుముందు మంత్రికి కలెక్టర్ అభిలాష అభినవ్ మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసినట్లు తెలిపారు. దశలవారీగా ప్రతీ లబ్ధిదారుడికి ఇల్లు అందేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో రైతు భరోసా పథకం 100 శాతం అమలైందన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
పారదర్శకంగా పథకాలు..
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో దివ్యాంగుల కోసం అలెంకో సంస్థ ద్వారా రూ.1.21 కోట్లు విలువ చేసే ఉపకరణాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో 2,632 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని తెలిపారు. వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా మొత్తం 1,62,414 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామ రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వన మహోత్సవం సందర్భంగా దాదాపు 65 లక్షల మొక్కల నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపా రు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను, మహిళా సంఘాలకు రూ.133 కోట్ల రుణాల చెక్కులు పంపిణీ చేశారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అందజేశారు. సమావేశంలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్ట ర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఉన్నత అధి కారులు, ప్రజాప్రతినిధులు, పలు పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు.
మంత్రి ‘జూపల్లి’

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు