
ప్రాణహిత, చేవెళ్ల ప్యాకేజీ పనులు పూర్తి చేయాలి
గోదావరి ఉన్నప్పటికీ సాగునీటి సౌకర్యం లేని నియోజకవర్గం మాది. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా తలపెట్టిన 27, 28వ ప్యాకేజీల పనులు పూర్తి చేసి సాగునీటి సౌకర్యం కల్పించాలి. బాసర సరస్వతీ అమ్మవారి టెంపుల్కు గత ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించగా రూ.7 కోట్లే ఖర్చయ్యాయి. మిగతా రూ.43 కోట్లు ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వెంటనే విడుదల చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. 2027 జూన్లో రానున్న గోదావరి పుష్కరాలకు అవసరమైన చర్యలు చేపట్టాలి. – రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే