
నిధులు పెండింగ్లో పెట్టొద్దు
కొలాం, తోటి వంటి పీవీటీజీల ఇళ్ల నిర్మాణాలకు ఈజీఎస్ కింద కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు చెల్లించకుండా పెండింగ్లో పెడుతోంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రూ.742 కోట్లు వెంటనే విడుదల చేయాలి. 9,10వ తరగతుల విద్యార్థులకు ఎండీఎం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు. అర్హులైన గిరిజనులందరికీ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు వెంటనే జారీ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదా? అనేది స్పష్టం చేయాలి. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ