రుచికరమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రుచికరమైన భోజనం అందించాలి

Jun 27 2025 4:11 AM | Updated on Jun 27 2025 4:11 AM

రుచికరమైన భోజనం అందించాలి

రుచికరమైన భోజనం అందించాలి

● ఆర్‌సీవో శ్రీధర్‌ ● లక్ష్మణచాంద, మామడ ఎంజేపీ గురుకులాల తనిఖీ

లక్ష్మణచాంద: విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీధర్‌ పేర్కొన్నారు. మండలంలోని రాచా పూర్‌ గ్రామంలోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంట శాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం తయారు చేస్తున్న వంటను పరిశీలించారు. కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని పలు రికార్డులు తనిఖీ చేశారు. ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన విద్యార్థి గోకుల్‌ నాయక్‌ను సన్మానించి అభినందించారు. నూతనంగా చేరిన విద్యార్థుల అకౌంట్‌లను త్వరగా తీయించాలని అందులోనే విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలు జమవుతాయని తెలిపారు. విద్యార్థులకు నిత్యం పోషక విలువలు గల నాణ్యమైన, రుచికరమైన భో జనం అందించాలని సూచించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్‌ రాజు, ఉపాధ్యాయులు పుణ్యవతి, గంగజమున, నాగరాజు, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

మామడ కేజీబీవీ..

మామడ: మండల కేంద్రంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబందించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ విద్యార్థికి బ్యాంకు అకౌంట్‌ తీయించాలని తెలిపారు. ప్రభుత్వం అందించే కాస్మోటిక్‌ డబ్బులు విద్యార్థుల అకౌంట్‌లలో అందిస్తారని అన్నారు. కిచెన్‌లో మెనూను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement