ఏరియా ఆస్పత్రిని సందర్శించిన జడ్జి | - | Sakshi
Sakshi News home page

ఏరియా ఆస్పత్రిని సందర్శించిన జడ్జి

Jun 29 2025 2:28 AM | Updated on Jun 29 2025 2:28 AM

ఏరియా ఆస్పత్రిని  సందర్శించిన జడ్జి

ఏరియా ఆస్పత్రిని సందర్శించిన జడ్జి

భైంసాటౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని భైంసా ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ డి.దేవేంద్రబాబు శనివారం సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కాశీనాథ్‌తో కలిసి వార్డులను పరిశీలించారు. ఓపీ, ఆపరేషన్‌ థియేటర్‌, రోగుల వార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు, డయాలిసిస్‌ సెంటర్‌ నిర్వహణ గురించి అడిగి తెలు సుకున్నారు. రోగుల తాకిడి, వైద్యులు, సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. రోగులతో మాట్లా డి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. జడ్జి వెంట ఆస్పత్రి వైద్యుడు అనిల్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement