
పనులు పరిశీలించిన జలశక్తి అభియాన్ బృందం
తానూరు: మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఉపాధిహమీ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర జలశక్తి అభియాన్ పరిశీలకుల బృందం శనివారం పరి శీలించింది. మండలంలోని ఉమ్రి(కే), తొండా ల, దాగాం, కోలూరు, దౌలతాబాద్, ఖర్బాలా, ఎల్వత్, వాడవన గ్రామాల్లో పర్యటించి ఇంకుడు గుంతలు, ఫారంపాండ్, మినీ ట్యాంక్ నిర్మాణ పనులు పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. నివేదికను కేంద్ర జలశక్తి అభియాన్ అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఏలు గంగాధర్, ప్రసాద్, పోశెట్టి, సిబ్బంది పాల్గొన్నారు.