
పత్రికాస్వేచ్ఛపై దాడి గర్హనీయం
నిర్మల్: పత్రికాస్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఖండిస్తున్నామని జిల్లా జర్నలిస్టు సంఘాలు, ప్రెస్క్లబ్ నాయకులు, పాత్రికేయులు పేర్కొన్నారు. కొమ్మినేని అరె స్టు, ఏపీలోని సాక్షి కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులపై జిల్లాకేంద్రంలో మంగళవారం నిరసన తెలిపారు. స్థానిక విశ్రాంతి భవ నం నుంచి గాంధీపార్క్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డా రు. టీయూడబ్ల్యూజే(143) నేషనల్ కౌన్సిల్ మెంబ ర్ అల్లం అశోక్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జ్లిలా ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య మాట్లాడు తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న మీడియాపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. వేరొకరి వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్టు కొ మ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదించి అరెస్టు చేయ డం, సాక్షి మీడియాపై దాడులు చేయడం దారుణ మన్నారు. నిరసనలో జర్నలిస్టు సంఘాల, ప్రెస్క్లబ్ నాయకులు, జిల్లా పాత్రికేయులు, పాకాల ఫౌండేషన్ చైర్మన్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.