
88 ఏళ్ల వయసులో కోర్టుకు..
నిర్మల్: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలా నికి చెందిన సాధు ఇందిరమ్మ(88) ఏళ్ల వయసులో కోర్టు మెట్లు ఎక్కింది. ఆస్తుల విషయంలో కుటుంబంలో గొడవ జరగడం, బంధువులు ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో న్యాయం కోసం నిర్మల్ కోర్టును ఆశ్రయించింది. విచారణలో భాగంగా మంగళవారం ఇందిరమ్మ వాగ్మూలం ఇవ్వాల్సి ఉండడంతో కు టుంబ సభ్యులు ఆమెను కోర్టుకు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జూనియర్ సివిల్ జడ్జి రవీందర్ బెంచ్ దిగి.. బయటకు వచ్చారు. వృద్ధురాలి వాంగ్మూలం తీసుకున్నారు.