
అటవీ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవె న్యూ, అటవీ, విద్యుత్, ఆర్అండ్బీ, పంచా యతీరాజ్, ఇరిగేషన్ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. మారుమూల గిరిజన, అటవీ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు అటవీశాఖకు ప్రపోజల్స్ పంపించాలని సూచించారు. విద్యుత్ లైన్ల ఏర్పాటుకు పరివేష్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలని సూచించారు.