
పునఃప్రారంభానికి సిద్ధం
నిర్మల్
విప్లవ వీరుడా.. ఇక సెలవు..!
అడవిలో రక్తపు సింధూరమై 30 ఏళ్ల తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చిన అడెల్లు మృతదేహం ఎర్రని వర్ణపు తాకిడికి తడిసి ముద్దయింది.
● డీఈవో రామారావు
మంగళవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2025
8లోu
బ్యాడ్మింటన్లో ప్రతిభ
నిర్మల్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8న మంచిర్యాల్లో నిర్వహించిన చాంపియన్షిప్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అండర్–11 సింగిల్స్లో అర్జున్ 2వ స్థానంలో, డబుల్స్లో అర్జున్, అమన్ మొదటి స్థానంలో నిలిచారు. అండర్–11 బాలికల డబుల్స్ విభాగంలో శ్రీకతి, హర్షిత రెండోస్థానంలో నిలిచారు. అండర్–13 సింగిల్స్లో శ్రీహర్షిత్ మొదటి స్థానంలో నిలిచాడు. అండర్– 15 మిక్స్డ్ డబుల్స్లో ఆరాధ్య, శ్రీహర్షిత్ రెండోస్థానం సాధించారు. అండర్–15 బాలికల డబుల్స్లో ప్రతిభ, సహర్షి రెండో స్థానంలో నిలిచారు. ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సుధాకర్, వన్నెల భూమన్న, సందీప్, ప్రశాంత్, మాణిక్యం, భారత్, శ్రీనివాస్, ముత్యం విద్యార్థులను అభినందించారు.
లక్ష్మణచాంద: మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను పునఃప్రారంభానికి సిద్ధం చేశామని డీఈవో తెలిపారు. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై జిల్లా విద్యాధికారి పి.రామారావుతో ఇంటర్వ్యూ.
సాక్షి: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయా?
డీఈవో: జిల్లాలో మొత్తం 787 ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈనెల 12న పాఠశాలల పునఃప్రారంభానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం.
సాక్షి: పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు మొదలయ్యాయా, ఎలా చేయిస్తున్నారు?
డీఈవో: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సూచనల మేరకు ఇప్పటికే పాఠశాలలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామపంచాయతీ సిబ్బందితో పనులు చేయించాం. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేయడంతో పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చకచకా పూర్తి చేస్తున్నారు.
సాక్షి: శిథిలావస్థకు చేరిన పాఠశాలలో ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఈవో: జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తొలగించడానికి ఎంపీడీవో, ఎంఈవో, ఇంజినీరింగ్ సిబ్బందికి తగిన మార్గదర్శకాలు జారీ చేశాం. ఈ విషయమై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో దగ్గరుండి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. శిథిలావస్థకు చేరిన పాఠశాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించాం.
సాక్షి: విద్యార్థుల సంఖ్య పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఈవో: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రొషెసర్ జయశంకర్ బడిబాట. ఇందులో భాగంగా ప్రతీ పాఠశాల ఉపాధ్యాయులు వారి పరిధిలోని గ్రామాల్లో 6–14 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి వారికి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను తెలియజేస్తూ తమ పిల్లలను చేర్పించేలాగా అవగాహన కల్పించాలని సూచించాం. అదేవిధంగా పాఠశాలలోని గత విద్యార్థులు సాధించిన పురోగతిని తెలియజేస్తూ పిల్లల సంఖ్యను పెంచడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు బాధ్యతతో విద్యార్థుల నమోదు పెంచేలాగా ఎంఈవోల ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
సాక్షి: అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలో చేపడుతున్న పాఠశాలల పనులు పూర్తయ్యాయా?
డీఈవో: జిల్లా వ్యాప్తంగా 628 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు చేపట్టడం జరిగింది. ఇందులో ఇదివరకే 590 పాఠశాలల్లో పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలిన 38 పాఠశాలల్లో చివరి దశలో ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి అవి కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
సాక్షి: పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నాయా?
డీఈవో: పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి వసతిని, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది. ఏమైనా మరమ్మతులు ఉంటే వేసవిలోనే పూర్తి చేయాలని సూచించడం జరిగింది. అన్ని పాఠశాలలో ప్రారంభం నాటికి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేలాగా చర్యలు తీసుకుంటున్నాం.
సాక్షి: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా.. ఎంత మందిని సర్దుబాటు చేశారు.
డీఈవో: కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది. అటువంటి పాఠశాలలో ప్రస్తుతం సర్దుబాటు ప్రక్రియ జరుగుతోంది. పాఠశాలల ప్రారంభంనాటికి ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
సాక్షి: విద్యార్థులకు అవసరమైన నోటుబుక్స్, పాఠ్య పుస్తకాలు ప్రారంభంరోజు అందిస్తారా?
డీఈవో: జిల్లాలో మొత్తం విద్యార్థులకు పార్ట్ 1 పుస్తకాలు 3,40,220 అవసరం కాక ఇదివరకే అన్ని ఎంఈవో కార్యాలయాలకు సరఫరా చేశాం. అక్కడ నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించారు. పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాం.
సాక్షి: మొదటి రోజే యూనిఫామ్ అందిస్తారా?
డీఈవో: జిల్లాలో మొత్తం 48,874 మంది విద్యార్థులకు ఒక జత చొప్పున యూనిఫాం స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో కుట్టించాం. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల వద్దకు వెళ్లి ఒక జత యూనిఫామ్ తీసుకోవడం జరుగుతుంది. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేస్తాం.
న్యూస్రీల్

పునఃప్రారంభానికి సిద్ధం

పునఃప్రారంభానికి సిద్ధం